1. Home
  2. »
  3. వేదములలోని మర్మములు
  4. »
  5. క్రైస్తవ మార్గములో వున్న తప్పులను తీసి చూపించి లోకమంతటనూ వున్న క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు అను శీర్షికలోని ప్రశ్నలకు జవాబులు
క్రైస్తవ మార్గములో వున్న తప్పులను తీసి చూపించి లోకమంతటనూ వున్న క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు అను శీర్షికలోని ప్రశ్నలకు జవాబులు
క్రైస్తవ మార్గములో వున్న తప్పులను తీసి చూపించి లోకమంతటనూ వున్న క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు అను శీర్షికలోని ప్రశ్నలకు జవాబులు లోకమంతటిలోనూ ఉన్న క్రైస్తవులందరికి ఒక గొప్ప సవాల్‌ అను అంశములో గతసంచికలలో వెలువడిన ప్రశ్నలు చదివి కొంతమంది క్రైస్తవ స్నేహితులు మేము వారికి విరోధముగా నడుచుచున్నాము అని అనుకొనుచున్నారు. అది పూర్తిగా తప్పైయున్నది. నేను క్రైస్తవుడను అని చెప్పుకొనుటకు ఆత్మీయఫలములు అయిన తొమ్మిది గుణములు వారి వద్ద వున్నవా అని పరిశీలించి చూచుకొనవలెను. క్రైస్తవుడను అని చెప్పుకొనుచున్న ఒక్కొక్క క్రైస్తవుడు క్రీస్తుబోధలో నడుచుకొనువాడై యుండవలెను. యోహాను 1: 9 నుండి 11 వాక్యములు. ”క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈభోదను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” అంటే క్రీస్తు అనే వ్యక్తి ఎవరు? ఆయన ఆది నుండే క్రీస్తుగా వున్నాడా? లేక 2000 సంవత్సరములకు ముందు మాత్రమే క్రీస్తుగా అయియున్నాడా?అనేది ముఖ్య ప్రశ్న. కనబడనటువంటి దేవుడు రక్తమును, మాంసమును కలిగిన తన యొక్క పిల్లలకు తనను బయలుపరచుకొనుటకు చివరి దినములలో అన్యజనుల కొరకు దావీదు వంశములో జన్మించివచ్చుచున్నారు. ”రోమా 15:12. యెష్షయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు” కనబడే స్థితిలో క్రీస్తు దావీదుకుమారుడు లేదా కుమారుడు అని పిలువబడుచున్నాడు. కనబడని స్థాయిలో ఆయన తండ్రి అని పిలువబడుచున్నాడు. కాని ఆయన ఒకే వ్యక్తి మాత్రమే. కాని ఇది తెలియని మతభోదకులు విభజనలు తీసుకొని వచ్చి జనుల వద్ద డబ్బును పోగుచేసుకొనుచున్నారు. పరిసయ్యులు యేసు వద్ద ప్రశ్న అడుగుటకు వచ్చినప్పుడు యేసువారిని చూచి క్రీస్తును గురించి మీరు ఏమనుకొనుచున్నారు. అతను ఎవరి కుమారుడు అని అనుకొనుచున్నారు అని అడిగినప్పుడు వారు ఆయన దావీదుకుమారుడు అని ప్రత్యుత్తరమిచ్చిరి. దానికి ఆయన అయితే దావీదు పరిశుద్దాత్మ చేత తన కుమారుని చూచి ప్రభువా అని ఏవిధముగా పిలిచెను. దావీదు ఆయనను ప్రభువు అనిచెప్పగా దావీదుకు ఆయన ఏవిధముగా కుమారుడు కాగలడు! అని అడిగెను. ఈ ప్రశ్నకు వారు జవాబు చెప్పలేకపోయారు. గడచిన 2000 సంవత్సరములుగ ఈ ప్రశ్నకు క్రైస్తవ సముదాయము కూడా జవాబు చెప్పలేకపోవుచున్నారు. ఎందుకంటే యేసు దావీదు వంశములో వచ్చిన ఒక పురుషునికి, స్త్రీ కి పుట్టలేదు. ఆయన పరిశుద్దాత్మ చేత జన్మించెను. ఇద్దరు గ్రుడ్డివారు యేసును చూచి దావీదుకుమారుడా అని పిలిచినప్పుడు దానికి యేసు చెవియొగ్గలేదు. ఈ రహస్యమును పరిశుద్దాత్మ పొందుకొనిన జనులు ప్రత్యక్షతల ద్వారా అర్దం చేసుకొనగలరు గాని క్రైస్తవ మార్గములో చేరుట వలన మాత్రం అర్ధం చేసుకొనలేరు. గడచిన 6000 సంవత్సరములుగా ప్రతీ భాష వారికి పలుజాతుల వారికి దేవుడు పలురకములైన కారణపేరులతో బయలుపరచబడెను. ఓం అనియు, ఏలోహిమ్‌ అనియు, యెహోవా అనియు, యేసు అనియు, హరి అనియు, రాముడు కృష్ణుడు అనియు ఇంకా అనేక కారణపేరులతో తనను బయలుపరచుకొనెను. మతనాయకులు ఈ పేరులను విభజించి ఒక్కొక్క మతముగా ఏర్పాటుచేసియున్నారు. కాని భగవంతుడయితే ఒక్కడే. కొందరు తమను భగవంతుని ప్రతినిధులుగా చూపించుటకు ఇష్టపడి ఈ విధముగా అబద్దమైన బోధనలను ప్రచారము చేయుచున్నారు. ఈ క్రైస్తవ సముదాయం మతబోధకుల యొక్క తంత్రముల వలన నిజమును తెలుసుకొనుటకు ప్రయత్నించకుండా తర్కము చేయుచున్నారు. యేసు చెప్పిన విధముగా యోహాను 5:39 ”లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి.” అదే విధముగా ఆత్మీయకన్నులతో ఈ ప్రశ్నలన్నింటికి బైబిల్‌ నుండి జవాబును వెదకుటకు ప్రయత్నించినచో మత బోధకులు చెప్పుచున్న వివరణలలో ఉన్న తప్పులను మీరు తెలుసుకొనగలరు. అవతారపురుషునిగా భగవంతుడు జనుల స్థితికి తగిన విధముగా ప్రతీ యుగములోనూ బయలుపడును. అనే ఆలోచనతో ఈ ప్రశ్నలు చదువు వారికి వివరణ ఇవ్వవలసిన పనిలేదు. యేసు అంటే యెహోవా రక్షకుడు అని అర్ధము. యేసే దేవుడు. మిగతావారు ఆరాధించేవన్నీ దేవుడు కాదని వారు చెప్పినట్లయితే రెండువేల సంవత్సరములకు ముందు నివసించిన వారికి దేవుడు ఎవరు? అను ప్రశ్న వచ్చుచున్నది. అదే విధముగా మహ్మదు నభికి తరువాత వేరే ప్రవక్తలులేరని ఇస్లామీయులు ఖచ్చితముగా చెప్పుచున్నారు. అంటే భారతదేశములో అవతరించిన అనేకమంది ప్రవక్తల గురించి ఏమిటి? ఉదాహరణగా వళ్ళువర్‌, గురునానక్‌, రామకృష్ణ పరమహంస, నారాయణ గురు, రాఘవేంద్రుడు, ఠాగూర్‌, వళ్ళలార్‌, వీరబ్రహ్మం, వివేకానందుడు, బసవప్ప, తిరుమూలర్‌, ముత్తుకుట్టి, మహాత్మాగాంధి మున్నగువారు. ఇస్లాం మతం నిజమైన మతమయితే మహ్మదు నభికు ముందుగా వచ్చిన నభిలు ఏమతమునకు చెందిన వారు అనే ప్రశ్న వచ్చుచున్నది. యేసు యొక్క సమయము నుండి యూదా మతనాయకులు వారు మేము మోషే యొక్క శిష్యులము. మోషేతో దేవుడు మాట్లాడియున్నాడని మాకు తెలుసు. అయితే ఇతను ఎక్కడినుండి వచ్చాడని తెలియదు అనిఅంటున్నారు. అదే విధముగా ఈ కాలములోనూ క్రైస్తవుల మధ్యలో పాలాశీర్‌ లారి ముత్తుకృష్ణ ప్రశ్నించినప్పుడు మాకు యేసు వున్నాడు. మనుష్యకుమారుడైన పాలాశీర్‌ లారి ఎవరు? అని అడుగుచున్నారు. చరిత్ర తిరుగుచున్నది. ఈ వేసినప్రశ్నలు అబద్దమైన క్రైస్తవులు ఎవరు, నిజమైన క్రైస్తవులు ఎవరు అని నిరూపించుచున్నది. దీని గురించికోపపడిన అనేక మంది మమ్ములను వ్యతిరేకించుచున్నారు. కాని మేము క్రైస్తవులను వ్యతిరేకించలేదు. ద్వేషించనూ లేదు. మీరు నిత్యజీవము పొందుటకు వేదములను చదివి పరిశీలించాలి అనే ఉద్దేశ్యముతో ఈ ప్రశ్నలు వేయుచున్నాము. కాబట్టి వేదములు చదివి వాటిలో ఉన్న రహస్యములు తెలుసుకొనుడి. పైన చెప్పబడిన అంశములను మనస్సున పెట్టుకొని ఈ ప్రశ్నలను చదువవలెను. యేసు ఈ లోకములో ఉన్నప్పుడు తన రూపమును మార్చుకొనెను అనుటకు నాలుగు సువార్తలలోనూ ఆధారములున్నవి. తర్జుమాలో అనేక తప్పులు ఉన్నందువలన బైబిల్‌ చదువుచున్న వారికి అనేకమైన సత్యములు తెలియడము లేదు. ఇంగ్లీషు బైబిల్‌లో మార్కు 16:12లో ఆయన వేరే ఒక రూపములో వచ్చాడని వ్రాయబడియున్నది. ఇతర భాషలలో ఆవిధముగా తర్జుమాచేయబడలేదు. బాప్తీస్మము ఇచ్చు యోహాను యేసును చూచి ఈయనే దేవుని గొఱ్ఱెపిల్ల అని గుర్తు చూపించెను. క్రైస్తవ మతము చెప్పు విధముగా యేసు బలియై, బూడిదైపోతే ఒక బలి తిరిగి జీవముతో వచ్చినది అనుటకు సూచనగా వేదములలో నుండి ఏదైనా రెండు ఆదారములను చూపించగలరా? ఇప్పటి వరకూ ఎవరూ ఆదారమును చూపించలేకపోయారు. ఆవిధముగా అయితే జీవముతో లేచినది ఎవరు అని ప్రశ్న వచ్చుచున్నది. ”యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండునో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో వుండును. మత్తయి 12:40” అని యేసు చెప్పెను. దాని ప్రకారం యేసు శుక్రవారం సాయంత్రం సమాధి చేయబడి ఆదివారం తెల్లవారుజామున జీవముతో తిరిగిలేచివుంటే ఆయన మూడు దినములు సమాధిలో వుండియుండెనా? అని ప్రశ్న వచ్చుచున్నది కధా! ఆలోచించండి. సౌలు అయిన పౌలు యేసును అంగీకరించిన జనులను చంపెను. ఆ సమయమున అతను ఒక దర్శనం చూచాడు. అది వేదములలో వ్రాయబడలేదు. కాని అగ్రిప్పరాజుతో అతను వాగ్వాదం చేసినప్పుడు కాబట్టి అగ్రిప్పరాజా పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాలేని అని చెప్పెను. అపొ.కా 25:19 ”అయితే యూదా మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను.”(అపొ.కా. 25:19). ఫేస్తు విచారణ చేసినప్పుడు ఆ విచారణలో యూదా మతమును గురించి కొన్ని తర్కములను గురించియు అతనిపేరున యూదులు విరోధముగా చెప్పియున్నారు. దానిననుసరించి యేసు మరణించలేదు. ఆయన జీవముతో వున్నాడని పౌలు వాధించెనని నిరూపించబడినది. ఆలోచించండి. తీతు 1:13 ”ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాకధలను, సత్యము నుండి తొలగిపోవు నట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము” అని పౌలు హెచ్చరించినది సిలువ ఉపదేశము గూర్చియే అని మీరు తెలుసుకొనవలెను. సిలువ మరణము అనునది యూదులు తీసుకొని వచ్చిన కట్టుకధ. ఇస్కారియోతు యూదా మత్తయి 27:5 ”అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ” అనివ్రాయబడియున్న దానికి ”అపొ.కా. 1:18 వ ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతనిపేగులన్నియు బయటికి వచ్చెను.” అని వ్రాయబడియున్నదానికి వ్యత్యాసము వున్నది గదా! అలోచించండి. నిజముగా జరిగినది ఏమిటి? బైబిలులోనే వ్యతిరేకముగా వుండగలదా! పరిశుద్ద ఖురాన్‌ 4 సూరా 157వ ”వారు సత్యమును నిరాకరించి మర్యమ్‌కు వ్యతిరేకముగా భయంకరమైన అబద్దం చెప్పారు. స్వయముగా, మేము మర్యమ్‌ కుమారుడు అల్లాహ్‌ా ప్రవక్త అయిన అల్‌ మసీహ్‌ా ఈసా (యేసును) అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూలేదు. సిలువపైకి ఎక్కించనూ లేదు. కాని ఆ విషయములో వారు భ్రమకు గురిచెయ్యబడ్డారు.” 4:158 ”ఈవిషయం గురించి అభిప్రాయబేధం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరించుచున్నారు. వారు అతనిని నిశ్చయముగా చంపలేదు. కాని అల్లాహ్‌ా ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్‌ా అద్భుత శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు.” యేసుకు బదులుగా వేరే ఒకతను చంపబడినాడు అని ఖురాన్‌లో చెప్పబడియున్నది. ఆవిధముగా చంపబడిన వాడు ఇస్కారియోతు యూదా అని ఖచ్చితముగా చెప్పవచ్చును. దాని గురించిన ఆధారములు మా దగ్గర వున్నాయి. దానిని మా దగ్గర నుండి పొందుకొనవచ్చును. ……. సహో.తిమోతి, విజయవాడ
Scroll to Top