ఈ మనుజ్యోతి పత్రికను తరుచుగా చదువవలెనని ఆసక్తి గలవారు ప్రధానకేంద్ర చిరునామాకు వుత్తరము వ్రాసి మీ అడ్రసులను నమోదు చేయించుకొనవలెను. మా పత్రికలు మీకు నేరుగానో లేక తపాలా ద్వారానో ఉచితముగా పంపించబడును.

ఈ పత్రిక గురించి మీ జీవితములో పొందుకొనిన ఆత్మీయ అనుభవములను మాకు వ్రాసి పంపించినట్లయితే మా సంచికలో సంధర్భమును బట్టి ప్రచురించగలము. మనుజ్యోతిలో చోటు చేసుకొనే కవితలు, సారాంశములు కల్కిమహా అవతార పురుషుడైన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమార్థమై సమర్పించబడుచున్నవి. శ్రీలహరికృష్ణగారి ఉపన్యాసములనుండియు మరియు వేదములలోని రహస్యములను ఈ పత్రికలో ప్రచురించుచున్నాము. తరుచుగా వెలువడే ఈ మనుజ్యోతి పత్రికలో భగవద్గీత సారాంశము మరియు పరిశుద్ద ఖురాన్‌ యొక్క సారాంశము అను పుస్తకములలోని భాగములను అంచెలంచెలుగా ప్రచురించుచున్నాము. ఈ పుస్తకములు ప్రత్యేకముగా కావాలనుకొనేవారు మా చిరునామాను సంప్రదించగలరు.

ఇతర మతములవారు ఈ ఉపన్యాసములను అంగీకరించుటకు నిరాకరించవచ్చును. అందువలననే యిది శ్రీలహరికృష్ణగారి సిద్దాంతములను వెంబడించేవారి కొరకును, ”ఒకే దేవుడు – ఒకే దేశము” అనే చైతన్యమును నమ్మి దాని కొరకు వేచియున్నవారి నిమిత్తమును ఈ పత్రిక ఒక ప్రైవేటు సర్క్యులేషన్‌గా ప్రచురించబడుచున్నది. ఇతర మతములవారిని బాధించుటకు మాత్రము కాదు. భగవంతుని గ్రహించుటకు మతమును మార్చుకొనవలసిన అవసరము లేదు గాని మనస్సును మార్చుకొంటే చాలు అని చాటించుచున్నాము. కావున పాఠకులు పై తెలిపిన విషయములను గమనించ ప్రార్థన.

సంపాదకులు : డి. పాల్‌ ఉపాజ్‌ ఎన్‌. లారి
సహాయక సంపాదకులు : ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌, టి. జయ ప్రకాష్‌

Scroll to Top